పరిశుద్ధ గ్రంథము
యెషయా 3
Isaiah 3
చదవడం
యెషయా 3
చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు.
శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,
సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు,
“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను.
ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు.
ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని,
అతడు ఆ రోజున కేక వేసి,
తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది,
వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది.
నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు.
దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది.
చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు.
తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు.
యెహోవా తన ప్రజల పెద్దల మీద,
నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?”
యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు.
కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు.
ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ,
చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ,
తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ,
తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు,
ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ,
చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు,
అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం,
మనుషులు కత్తివాత కూలి పోతారు.
యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.